హోమ్ / వంటకాలు / తోటకూర రైలు ఫలహారం

Photo of Amaranthus Railu Palahaaram by Pravallika Srinivas at BetterButter
306
4
0.0(0)
1

తోటకూర రైలు ఫలహారం

Oct-23-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర రైలు ఫలహారం రెసిపీ గురించి

సాధారణంగా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మనకు గుర్తుకు వచ్చేది రైలు అందులోను దూర ప్రయాణం సౌకర్యంగా ఉండాలి అంటే రైలు మంచిమార్గము. ఈ రోజుల్లో అంటే ఎక్కడపడితే అక్కడ ఆహరం దొరుకుతుంది కానీ వెనకటి రోజుల్లో ప్రాణం అంటే ఇంట్లోనే ఈజీగా చేస్కునేవి తీస్కొని వెళ్తారు.ఆ ట్రైన్ లో ఎలా చేస్తారో అం వేస్తారో అని బయపడి తినేకన్నా ఇలాంటి మంచి ఆరోగ్యమైన అల్పాహారం తీసుకోవడం మంచిది. అర్ధమయ్యింది కదా ఈ రైలు ఫలహారం పురాతన వంటి తెలంగాణాకు చెందిన వంటి. ఎవరు సృష్టించారో తెలియదు కానీ వాళ్లకి జోహార్లు. నేను కొంచం వెరైటీ గా ఇందులో తోటకూరతో కలిపి చేశాను.మరి వెరైటీ కనుమరుగు అవుతున్న వంటని చూసేద్దామా ?

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • తెలంగాణ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • ఆవిరికి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. తోటకూర - 1 కప్పు
  2. బియ్యంపిండి - 1 కప్పు
  3. నీరు - 2 కప్పులు
  4. ఉప్పు - తగినంత
  5. పచ్చిపప్పు - 4 టేబుల్ స్పూన్లు
  6. పెసరపప్పు - 3 టేబుల్ స్పూన్లు
  7. పచ్చిమిర్చి - 5
  8. అల్లం - 1 అంగుళం ముక్క
  9. వెల్లులిరెబ్బలు - 2
  10. నూనె - తగినంత
  11. పోపుదినుసులు - 1 tbsp
  12. కర్వేపాకు - 1 రెమ్మ
  13. ఎండుమిర్చి - 4
  14. ఇంగువ - 1/4 స్పూన్
  15. పసుపు - 1/4 స్పూన్

సూచనలు

  1. ఒక గంట ముందు పచ్చిపప్పు, పెసరపప్పు నానపెట్టుకోవాలి.
  2. ముందుగా ఒక బాండి తీస్కుని నీరు ఉప్పు వేసి మరిగిన తర్వాత బియ్యంపిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
  3. దీన్ని కొంచం ఉడికించుకొని అయ్యాక పక్కకు పెట్టుకోవాలి.
  4. చల్లారేలోగా తోటకూర వలిచి కడిగి తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని చీలికలు చేసుకోవాలి.
  5. ఇప్పుడు చల్లారిన బియ్యంపిండి చేతికి నూనె రాసుకొని చిన్న చిన్న ఉండలు కట్టుకోవాలి.
  6. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లో పెసరపప్పు, పచ్చిపప్పు ,పచ్చిమిర్చి, అల్లం ,వెల్లులిరెబ్బలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
  7. కడాయి పెట్టి నూనె వేసి కాగాక పోపుదినుసులు ,యండుమిర్చి ,ఇంగువ, కర్వేపాకు వేసి చిటపటలాడాక తరిగిన తోటకూర ,పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించుకోవాలి.
  8. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పప్పుల మిశ్రమం వేసి బాగా కలుపుకొని మగ్గనివ్వాలి.
  9. ముందుగా తయారు అయినా చిట్టి ఉండలను వేసి బాగా కలుపుకోవాలి.
  10. మూత పెట్టి సన్న మంటపైన ఉడికించుకోవాలి.
  11. అంతే ఘుమఘుమలాడే తోటకూర రైలు ఫలహారం రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర